మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, 2వ అంతస్తు, ప్లాట్ నెంబర్ 9, నాలుగో వీధి బండి, స్టాండ్లి వీధి, ఉమా శంకర్ నగర్, కానూరు, విజయవాడ-520007.
To join My Telegram Channel Click here
Get FREE Teachers Related News and Job Alerts Directly on WhatsApp Click here
Facebook Click here
* 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ ప్రకటన
మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాల బాలికల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీష్ మీడియం) స్టేట్ సిలబస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్ధుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది ప్రవేశ పరీక్ష తేదీ నాడు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల ననుసరించి ఆయా ఎం జె పాఠశాలల్లో . లేదా బీసీ హాస్టల్ లో పరీక్ష నిర్వహించబడును.
1. పరీక్ష కొరకు అర్హత::
వయస్సు: బీసీ ఈబీసీ మరియు ఇతర విద్యార్థులు 11 సంవత్సరాల వయసు మించి ఉండరాదు వీరు 01.09.2014 మరియు 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్ధులు 12 సంవత్సరముల మించి ఉండరాదు. వీరు 01.09.2013 మరియు 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి.
2. ఆదాయ పరిమితి::
విద్యార్ధుల తల్లిదండ్రుల సంరక్షకుల సంవత్సర ఆదాయం రూ. 100000 లకు మించరాదు.
పాత జిల్లాల ప్రకారము జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో గత రెండు సంవత్సరాల నుండి నిరంతరంగా 2023-24, 2024-25 చదువుతూ ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగవ తరగతి 2024 25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి.
3. పాఠశాలలో ప్రవేశం ::
విద్యార్థుల ఎంపికకు ప్రతి జిల్లా ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది పట్టిక ఒకటిలో ఆయా జిల్లాలకు సీట్ల కేటాయింపు వివరాలు పొందుపరచడమైనది
4. ప్రవేశ పరీక్ష:
ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం (సైన్స్ మరియు సాంఘిక శాస్త్రం) లలో 4వ తరగతి స్థాయిలో (02) రెండు గంటల వ్యవధిలో 100 మార్కులకు తెలుగు 15 ఇంగ్లీషు 25 లెక్కలు 30 సరిసరాల విజ్ఞానం 30 మార్కులలో ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది.
2. పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీషులో ఉంటుంది.
5. పరీక్షా కేంద్రం::
విద్యార్థిని విద్యార్థులకు వారి సొంత జిల్లాల్లో మాత్రమే పరీక్ష నిర్వహించబడును పరీక్షా కేంద్రం వివరాలు హాల్ టిక్కెట్ లో ఇవ్వబడును ఒక పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువైనప్పుడు ఆ విద్యార్ధులను దగ్గరలోని ఇతర పరీక్షా కేంద్రాలకు కేటాయించబడును.
6. పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం::
అర్హులైన విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరి( ఆనాద, మత్స్యకార మరియు అభ్యర్థి కోరన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయబడును....
బీసీ గురుకుల పాఠశాలలలో ప్రవేశానికి రిజర్వేషన్ల వివరాలు
ఏదేని రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్ధులు లేనియెడల అట్టి ఏదేని రిజర్వేషన్ ఖాళీలను బీసీ
కేటగిరి అభ్యర్ధులకు కేటాయిస్తారు.
> ఎంపిక సమానమైన ర్యాంక్ ఒకరి కంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేదీ ప్రకారం అధిక వయస్సు గల విద్యార్థికి ప్రాధాన్యత ఇవ్వబడును అప్పుడు కూడా సమానమైన ర్యాంకు వస్తే లెక్కలలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు అప్పుడు కూడా సమానమైన ర్యాంకు పొందితే పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.
రిజర్వేషన్ వికలాంగులకు కేటగిరి తో నిమిత్తం లేకుండా కేటాయించబడుతుంది. > జిల్లాల వారీగా పాఠశాల వివరాలు ఆ పాఠశాలలో ప్రవేశానికి అర్హత గల జిల్లాలు పట్టిక 01 లో ఇవ్వబడినవి.
ఎంపికైన విద్యార్థులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థలు అధికారం ఉంది.
ప్రవేశానికి ఎంపికైన అభ్యర్ధులకు మాత్రమే ప్రవేశ అనుమతి పత్రాలు కాల్ లెటర్స్ సంబరును లేదా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వబడును.
మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా మొదటి లిస్టు రెండవ లిస్టు మూడవ లిస్టు ఖాళీలను బట్టి ఇవ్వబడుతుంది.
7. దరఖాస్తు చేయు విధానం
అభ్యర్ధులు పై అర్హతలు పరిశీలించుకుని సంతృప్తి చెందిన తరువాత ఏదేని సిమెంట్ ఏపీ ఆన్లైన్ ప్రాథమిక వివరాలతో విద్యార్ధి పేరు పుట్టిన తేదీ తండ్రి సంరక్షకుని మొబైల్ నెంబరు వెళ్లి రు 100 చెల్లించిన తరువాత ఒక జర్నల్ నంబరు ఇవ్వబడుతుంది జర్నల్ నంబరు పొందినంత మాత్రాన దరఖాస్తు చేసుకున్నట్లు కాదు అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేయు నంబర్ మాత్రమే
ఆ జనరల్ నెంబర్ ఆధారంగా ఏదేని ఇంటర్నెట్ సెంటర్ లేదా కంప్యూటర్ నుండి వెబ్సైట్ http://... ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి ఈ జనరల్ నెంబర్ను పరీక్ష ఫీజు చెల్లించిన వివరాలకు కేటాయించిన స్థలం కాలంలో నమోదు చేయవలెను.
గడువు
ఆన్లైన్ దరఖాస్తును తేదీ 15.02.2015 నుండి 15.03.2025 తేదీ వరకు చేసుకోవచ్చును ఆన్లైన్ దరఖాస్తును పంపిన తరువాత ఒక రిఫరెన్స్ నెంబరు ఇవ్వబడును నింపిన దరఖాస్తు నమోనా కాపీని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి.
దరఖాస్తు చేయు సమయానికి అభ్యర్ధి వద్ద కుల ధ్రువీకరణ సమీకృత కుల, జనన, ఆదాయం ధ్రువపత్రాలు) పుట్టిన తేదీ, ఆదాయ ధ్రువీకరణ, ప్రత్యేక కేటగిరి ధ్రువీకరణ, స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికెట్ మొదలగు దృవపత్రాలు (ఒరిజినల్) పొంది ఉండాలి. ఒరిజినల్ దృవపత్రాలను కౌన్సిలింగ్ సమయంలో సమర్పించాలి. లేనియెడల విద్యార్ధి ఎంపిక కాబడిన సీటు ఇవ్వబడదు.
ఆన్లైన్లో కాక నేరుగా సంస్థకు గాని గురుకుల పాఠశాలకు గాని మరియు ఈమెయిల్ ద్వారా గాని పంపిన దరఖాస్తులను పరిశీలించారు అట్టి అభ్యర్ధులను పరీక్షకు అనుమతించరు. > హాల్ టికెట్లు పరీక్ష తేదికి 7 రోజులు ముందుగా తమ రెఫరెన్స్ నెంబర్ ద్వారా హాల్ టికెట్లు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ ఆన్లైన్ సెంటర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును.
> హాల్ టికెట్లు పోస్టులో గానీ నేరుగా గాని అభ్యర్థులకు పంపబడవు కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.
అర్హత లేని అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలించబడవు.
8. దరఖాస్తు నింపుటకు అభ్యర్థులకు కొన్ని ముఖ్య సూచనలు
దరఖాస్తును ఆన్లైన్లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తు నింపుకోవాలి.
పరీక్ష కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేయాలి.
పాఠశాల ప్రాధాన్యత క్రమము ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టికను చూసుకొని నింపాలి.
పాస్పోర్ట్ సైజ్ ఫోటోను సిద్ధంగా ఉంచుకోవాలి,
దరఖాస్తును నింపునప్పుడు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను.
సెల్ నెంబరు వ్రాయునప్పుడు విద్యార్థి కుటుంబమునకు సంబంధించిన' నంబరు లేదా సమీప బంధువులు నంబరు ఇవ్వవలయును.
దరఖాస్తు నింపుటకు జరుగు పొరపాట్లకు అభ్యర్థియే పూర్తి బాధ్యత వహించాలి తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు.
ఒకసారి దరఖాస్తును ఆన్లైన్లో చేసిన తరువాత ఎలాంటి మార్పులకు తావు లేదు. కావున దరఖాస్తును అప్లోడ్ చేయుటకు ముందే అన్నీ వివరాలు సరిచూసుకోవాలి.
ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశానికి అర్హులు కాదు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ అమలు చేయబడును.
పట్టిక ఒకటి లో చూపించిన విధంగా ఆయా జిల్లాల విద్యార్థిని విద్యార్థులు ఆయా పాఠశాలలలో ప్రవేశానికి అర్హులు ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు ఎట్టి పరిస్థితులలో బదిలీ చేయబడురు.
9. విద్యార్థులకు అందించే సదుపాయాలు
ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువుకునే అవకాశం.
నెలకు రూ 1400 లతో పౌష్టిక విలువలతో కూడిన మెనూ.
3 జతల యూనిఫారం దుస్తులు,
దుప్పటి మరియు జంకాన
బూట్లు పాక్స్
బై మరియు బెల్ట్
నోట్ పుస్తకాలు టెక్స్ట్ పుస్తకాలు
స్టూడెంట్ కిట్
కాస్మోటిక్ చార్జీల నిమిత్తం బాలురకు నెలకు 125 రూపాయల చొప్పున 5, 6 తరగతులు, 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బాలురకు 150 బాలికలకు 6, 7 వ తరగతులవరకు చదువుతున్న పిల్లలకు నెలకు రూ. 130 చొప్పున మరియు 8వ తరగతి ఆపై క్లాసుల పిల్లలకు నెలకు రూ.250 ల చొప్పున చెల్లించడం జరుగుతున్నది. మరియు బాలురకు నెలకు రూ. 50 చొప్పున సలూన్ నిమిత్తం ఖర్చు చేయడం జరుగుచున్నది. > ఐదవ తరగతి ప్రవేశం పొందిన విద్యార్ధి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలల్లోనే విద్యను అభ్యసించవచ్చును.
సమీకృత పౌష్టిక ఆహారం క్రింద భోజు వేరుశనగ చిక్కి వారానికి 6 దినములు గుడ్డు రెండుసార్లు చీకెన్ ఇవ్వబడును.
ఉల్లాసభరితమైన ఆహ్లాదకరమైన వాతావరణం లో విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం లో బోధన చేయబడుతుంది. క్రీడలతో పాటు బోధనేతర కార్యక్రమాలలో కూడా శిక్షణ ఉంటుంది. గ్రంథాలయాలు ప్రయోగశాలలో డిజిటల్ తరగతులతో విద్యాబోదని జరుగుతుంది దరఖాస్తులను ఆన్లైన్లో .. వెబ్సైట్లో ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుండి దరఖాస్తు చేసుకోగలరు.
పూర్తి వివరాల కొరకు ఏదైనా మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల ద్యాలయం నందు కానీ లేదా విజయవాడలో గల సంస్థ కార్యాలయం ఫ్లాట్ నంబర్ 9 స్ట్రీట్ నెంబర్ 4 బండి అండ్ స్ట్రీట్ ఉమాశంకర్ నగర్ కానూరు విజయవాడ కార్యాలయంలో కార్యాలయ పని వేళల్లో స్వయంగాంప్రదించగలరు.
Online Application click here From 15/2/25
0 comments:
Post a Comment